పని చేస్తేనే ఓటు వెయ్యండి: కిషన్ రెడ్డి

-

పదేళ్లలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకి 10 లక్షల కోట్లు కేటాయించిందని ప్రగతి నివేదిక కార్యక్రమంలో కిషన్ రెడ్డి చెప్పారు. బిజెపి పార్టీ లేకపోతే తాను లేనని అన్నారు. తనపై ఎటువంటి అవినీతి మచ్చ లేదని అన్నారు. ఒక బిల్డర్ కాంట్రాక్టర్ అనేది నాకు ఇప్పటి దాకా తెలియదని అన్నారు. ఇప్పటిదాకా తాను బిల్డర్ కాంట్రాక్టర్లని బెదిరించలేదని చెప్పారు.

ఎవరిపై పక్షపాత ధోరణితో వ్యవహరించలేదని కిషన్ రెడ్డి అన్నారు. కొందరు వ్యక్తులు చెప్పలేని భాషలో విమర్శలు చేశారని అలాంటి వాళ్ళకి ప్రజలు గతం లో బుద్ధి చెప్పారన్నారు అలానే రాబోయే రోజుల్లో బుద్ధి చెప్తారని అన్నారు. తాను పని చేశాను అని భావిస్తే తనకి ఓటు వేయాలని కోరారు లేకపోతే ఓటు వేయద్దు అని తేల్చి చెప్పేశారు కిషన్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news