యువత చావుకు కారణం కాంగ్రెస్ పార్టీ: కిషన్‌రెడ్డి

-

తెలంగాణలో యువత చావుకు కారణం కాంగ్రెస్ అని, తెలంగాణ ప్రజల ఇబ్బందులకు కారణం కాంగ్రెస్ పార్టీ కాదా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సమాధానం చెప్పాలని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. నాంపల్లిలో ఆయన మాట్లాడుతూ.. BRSపై అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారని, ఏం వర్గానికి ఇచ్చిన హామీలను కేసీఆర్ నెరవేర్చలేదని, కేసీఆర్కు బుద్ధి చెప్పేందుకు యువకులు సిద్ధంగా ఉన్నారన్నారు. అంతేకాకుండా.. తెలంగాణకు పట్టిన కుటుంబ పార్టీ పీడ వదలాలి. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ కుటుంబ పార్టీలే. కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్ మాఫియా తెలంగాణను దోచుకుంది.

ఈ రెండు పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలని తెలంగాణ సమాజం కోరుకుంటుంది. ప్రత్యామ్నాయ నీతివంతమైన పాలన అందిస్తున్నారు ప్రధాని మోదీ. ఎన్నికలు అవుతున్న రాష్ట్రంలో కర్ణాటక మంత్రి నేలపై డబ్బు పోసి జల్సాలు చేస్తున్నారు. మూడు నాలుగు నెలల్లో వేల కోట్ల రూపాయలు కర్ణాటక ప్రభుత్వం వసూలు చేస్తుంది. చేయి గుర్తుకు ఓటేసిన పాపానికి కాంగ్రెస్ ఎలక్షన్ ట్యాక్స్ కట్టాల్సి వచ్చింది. తెలంగాణ లో డబ్బు రాజకీయాలు చేయాలని కాంగ్రెస్ చూస్తుంది. జాతీయ నాయకత్వం మొత్తం రాష్ట్రానికి రాబోతోంది. మేం ఏం చేశామో చెప్పి నిజాయితీగా ఓట్లు సాధించి అధికారంలోకి వస్తాం. సకల జనుల తెలంగాణ కోరుకుంటున్నారు ప్రజలు” అని కిషన్ రెడ్డి అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version