బీజేపీ పొత్తులపై కిషన్ రెడ్డి క్లారిటీ..!

-

పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ బిజెపి పొత్తుల మీద పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్రం మంత్రి కిషన్ రెడ్డి ఇంకోసారి క్లారిటీ ఇచ్చారు. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో బిజెపి ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవడం లేదని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో బిజెపి ఒంటరిగానే బరిలోకి దిగుతోందని అన్నారు ఈరోజు హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ సిట్టింగ్స్ స్థానాలతో పాటు ఈసారి తెలంగాణలో మెజార్టీ సీటు సాధించాలనేది మా లక్ష్యం అని అన్నారు.

బిజెపి అభ్యర్థుల ఫస్ట్ లిస్టులో తెలంగాణలోని 17 ఎంపీ స్థానాలకి గాను తొమ్మిది మంది పేర్లు ప్రకటించామని మిగిలిన ఎనిమిది మంది అభ్యర్థుల పేర్లను బిజెపి కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం తర్వాత ప్రకటిస్తామని చెప్పారు. జాతీయ అధ్యక్షుడు నడవడానికి కలిసి మిగిలిన ఎనిమిది మంది అభ్యర్థులపై చర్చిస్తామన్నారు ఆ తర్వాత అభ్యర్థులని ప్రకటిస్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news