పార్టీలో ఏవైనా అంతర్గత సమస్యలుంటే పరిష్కరించుకుంటాం : కిషన్‌ రెడ్డి

-

తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు పలు జిల్లాల్లో అనేక ప్రాంతాలు నీట మునిగాయి. వరద ప్రాంతాలను పరిశీలించాలని కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి నిర్ణయించారు. ఇవాళ ఆయన వరంగల్‌కు వెళ్లారు. ఆదివారం వరంగల్, హనుమ కొండ, భూపాలపల్లి, ఖమ్మం జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ బీజేపీలో నెలకొన్న పరిస్థితులపై స్పందించారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌తో తనకు పడదు అనేది పాత ముచ్చటని చెప్పారు.

పార్టీలో తనకు ఎవరితోనూ విభేదాలు లేవని తెలిపారు. పార్టీలో ఏవైనా అంతర్గత సమస్యలుంటే అందరం కలిసి మాట్లాడుకుని పరిష్కరించుకుంటామని చెప్పారు. తమ పార్టీలోనే ఉన్న మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని కలిస్తే తప్పేంటని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. కిరణ్ కుమార్ రెడ్డిపై విజయశాంతి చేసిన ట్వీట్‌ను తాను చూడలేదని కిషన్ రెడ్డి తెలిపారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version