స్టేడియంలో KKR జెండాలు.. సన్ రైజర్స్ ఫ్యాన్స్ ఆగ్రహం

-

సన్ రైజర్స్ హైదరాబాద్ , కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య క్వాలిఫయర్ 1 జరుగుతున్న నరేంద్ర మోదీ స్టేడియంలో మ్యాచ్కు ముందే కోల్కతా జెండాలు దర్శనమిచ్చాయి. అయితే.. న్యూట్రల్ వేదిక అయినప్పటికీ కుర్చీల్లో మొత్తం కేకేఆర్ జెండాలు ఉండటం కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తటస్థ వేదికపై పక్షపాతం చూపడాన్ని హైదరాబాద్ ఫ్యాన్స్ తప్పుబడుతున్నారు. ఇది సరి కాదని కామెంట్లు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే… గెలిచిన జట్టు నేరుగా ఫైనల్కు వెళ్తుంది. దూకుడు మీదున్న ఈ జట్ల మధ్య హోరాహోరీ సమరం గ్యారంటీ. బ్యాటింగ్, బౌలింగ్లో కోల్‌కతా నైట్ రైడర్స్ పటిష్ఠంగా ఉంది. బ్యాటర్లు విజృంభిస్తున్నా నిలకడ లేమి బౌలింగ్ సన్ రైజర్స్ హైదరాబాద్ కి ఇబ్బందిగా మారింది. ఇప్పటి వరకు 2జట్లు 26 సార్లు తలపడగా 17 మ్యాచుల్లో కోల్‌కతా నైట్ రైడర్స్ నెగ్గింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version