IPL 2022 : రాజస్థాన్‌కు రిటర్న్ గిఫ్ట్.. ప్రతీకారం తీర్చుకున్న కోల్‌కతా

-

రాజస్థాన్‌ తో జరిగిన కీలక మ్యాచ్‌ లో కేకేఆర్‌ విజయం సాధించింది. సంజూసేన విధించిన 153 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేకేఆర్‌ 19.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కోల్‌ కతా బ్యాటర్లలో రాణా, రింకూ సింగ్‌, అయ్యర్‌ రాణించారు.

రాజస్థాన్‌ బౌలర్లలో బౌల్డ్‌, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్‌ దీప్‌ సేన్‌ తలో వికెట్‌ తీశారు. తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన సంజూ సేన నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. కోల్‌ కతా ముందు 153 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. బ్యాటింగ్‌ లో కెప్టెన్‌ సంజూ శాంసన్‌ హాఫ్‌ సెంచరీతో ఆకట్టుకున్నాడు.

హిట్‌ మేయర్‌, బట్లర్‌, పరాగ్‌ తప్ప మిగతా వాళ్లెవరూ పెద్దగా రాణించలేకపోయారు. కేకేఆర్‌ బౌలర్లలో టిమ్‌ సౌథీ 2 వికెట్ల తీయగా… శివమ్‌ మావి, రాయ్‌, ఉమేష్‌ యాదవ్‌ తలో వికెట్‌ పడగొట్టారు. ఇక శ్రేయస్‌ అయ్యర్‌ సేనకు 5 పరాజయాల తర్వాత ఇదే తొలి విజయం కావడం విశేషం. ప్లే ఆఫ్స్‌ కు కేకేఆర్‌ చేరాలంటే.. వరుసగా మ్యాచ్‌ లు గెలివాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version