BREAKING : ఈ నెల 7వ తేదీన బీజేపీలో చేరనున్న కోమటి రెడ్డి !

-

మునుగోడు ఎమ్మెల్యే పదవికి అలాగే తన కాంగ్రెస్ సభ్యత్వానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో మునుగోడు నియోజకవర్గంలో ఉప ఎన్నిక నివార్యమైంది. దీంతో బిజెపి తీర్థం పుచ్చుకోనున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.

అయితే.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ నెల 7వ తేదీన బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారని సమాచారం అందుతోంది. జెపీ నడ్డా సమక్షంలో ఢిల్లీలోని జాతీయ కార్యాలయంలో.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరే ఛాన్స్‌ ఉందట.

దీంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిజెపి తరఫున మునుగోడు ఉప ఎన్నికల్లో బరిలో ఉండనున్నారు. అటు టిఆర్ఎస్ పార్టీ తరఫున కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని మరోసారి బరిలోకి దించుతారని ప్రచారం సాగుతోంది. అలాగే పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కూతురు కూడా టిఆర్ఎస్ పార్టీ టికెట్ ఆశిస్తున్నట్లు సమాచారం అందుతుంది. ఇక ఇటు కాంగ్రెస్ పార్టీ సైతం ఉప ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేసుకుంది. హుజూరాబాద్ తరహాలో తప్పులు చేయకుండా ముందుగానే అభ్యర్థిని ప్రకటించాలని ఆలోచన చేస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version