సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ రావుకు ఊహించని షాక్ తగిలింది. కొమ్మినేని శ్రీనివాస్ రావు రిమాండ్ విధించారు. కొమ్మినేనికి 14 రోజుల పాటు రిమాండ్ విధించింది కోర్టు. నేడు మంగళగిరి కోర్టులో హాజరు పరిచారు పోలీసులు. దింతో గుంటూరు జిల్లా జైలుకు కొమ్మినేని తరలించారు.

కాగా సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ తరుణంలోనే హైదరాబాద్ నుంచి సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు విజయవాడకు తరలించారు. టీవీ డిబేట్లో అమరావతి మహిళలను కించపరిచారనే అభియోగాలతో నమోదైన కేసుల్లో . సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్టు చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
అటు మాజీ సీఎం వైఎస్ జగన్, వైఎస్ భారతి, సాక్షి ఛానల్ కు బిగ్ షాక్ తగిలింది. మాజీ సీఎం వైఎస్ జగన్, వైఎస్ భారతి, సాక్షి ఛానల్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు మంత్రి గుమ్మడి సంధ్యారాణి. అమరావతి మహిళలను కించపరిచేలా సాక్షి కథనాలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటన చేశారు.