ఈ సెట్టింగ్స్ ను మార్చడంతో.. మీ మొబైల్ డేటాను ఆదా చేయవచ్చు..!

-

ఈ మధ్య కాలంలో మొబైల్ మరియు లాప్టాప్ వంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్‌ల ఉపయోగం ఎక్కువగా అయింది అనే చెప్పవచ్చు. దాంతో ఇంటర్నెట్‌ ను ఉపయోగించడానికి మొబైల్ డేటా ఎంతో అవసరంగా మారింది. ముఖ్యంగా రోజు ముగిసేలోగా మొబైల్ డేటా కూడా అయిపోతుంది అని అందరూ ఆందోళన చెందుతున్నారు. మొబైల్ డేటా‌ను వినియోగించకుండా త్వరగా పూర్తవుతుంటే ఈ సెట్టింగ్స్‌ ను మార్చాల్సిందే. ఇలా చేయడం వలన మొబైల్ డేటాను ఆదా చేసుకోవచ్చు. ఎప్పుడూ కూడా మొబైల్ లో బ్యాక్‌ గ్రౌండ్ యాప్‌ లను తీసేయాలి. బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అయ్యేటువంటి అప్లికేషన్లను మూయకపోవడం వలన అవి డేటాను ఉపయోగిస్తాయి.

కనుక ఉపయోగించని బ్యాక్‌గ్రౌండ్ యాప్‌లను క్లియర్ చేయాలి. కొన్ని సందర్భాల్లో అప్లికేషన్ లు ఆటో అప్డేట్ అవుతూ ఉంటాయి. దాని వలన మొబైల్ డేటా త్వరగా పూర్తవుతుంది. కనుక ప్లే స్టోర్‌లో సెట్టింగ్స్‌ను మార్చాల్సి ఉంటుంది. వైఫై ద్వారా మాత్రమే అప్డేట్ అయ్యే విధంగా సెలెక్ట్ చేయండి. అంతేకాకుండా వాట్సాప్‌ను ఎక్కువగా ఉపయోగించేవారు వాట్సాప్ కాలింగ్ ఫీచర్ల ను కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అయితే వాట్సాప్ లో వాయిస్ మరియు వీడియో కాల్స్ ఉపయోగిస్తున్నప్పుడు ఈ ఫీచర్‌ తో డేటాను సేవ్ చేయొచ్చు.

వాట్సాప్ సెట్టింగ్స్‌లో స్టోరేజ్ అండ్ డేటా‌ను ఎంపిక చేసుకుని సెట్టింగ్స్‌ను మార్చుకోవాలి.
ఇలా చేస్తే వాట్సాప్ కాల్స్‌ లో డేటాను తక్కువగా వినియోగించవచ్చు. అంతేకాకుండా మొబైల్ ఫోన్ లో లొకేషన్‌ ను ఆఫ్ చేయడం వలన మొబైల్ డేటాను సేవ్ చేయవచ్చు. ఎప్పుడైతే లొకేషన్ ఆన్‌ లో ఉంటుందో మొబైల్ డేటా త్వరగా అయిపోతుంది.
కనుక ఇటువంటి సెట్టింగ్స్‌ ను మీ మొబైల్ ఫోన్ లో మార్చడం వలన మొబైల్ డేటాను ఆదా చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news