అధికారం ఎవరికీ శాశ్వతం కాదు: కొప్పుల

-

మాజీ మంత్రి కొప్పుల చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. అధికారం ఎవరికి శాశ్వతం కాదని అహంకారం తగదని మాజీ మంత్రి కొప్పుల అన్నారు. బుధవారం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 50 రోజులు పైనే అయిందని అన్నారు. రేవంత్ రెడ్డి రాష్ట్ర ఎదుర్కొంటున్న సమస్యలను వదిలేసి రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు బిఆర్ఎస్ ని బద్నాం చేయడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు.

సీఎం బిజెపి బీఆర్ఎస్ కుమ్మక్కు అని నిరాహార ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు ప్రధాని నరేంద్ర మోడీని కేసీఆర్ ప్రశ్నించినంతగా ఎవరు ప్రశ్నించలేదని అన్నారు. నిజామాబాద్ ఎంపీ స్థానంలో హుజారాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ బిజెపిలో కుమ్మక్కై బీఆర్ఎస్ ని ఓడించాలని చెప్పారు. రాజకీయ లబ్ధి కోసమే రేవంత్ ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. మోడీని రేవంత్ రెడ్డి కలిసినప్పుడు బిఆర్ఎస్ ని ఫినిష్ చేద్దామని ప్రతిపాదించినట్లు పత్రిక రాసింది నిజమే కదా అని అడిగారు

Read more RELATED
Recommended to you

Latest news