తక్కువ మార్జిన్ తోనే ఓడాం.. నిరాశ చెందొద్దు : కేటీఆర్

-

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు హోరాహోరీగా సాగిన సంగతి తెలిసిందే. దుబ్బాక ఎన్నికల్లో గెలిచిన భారతీయ జనతా పార్టీ గ్రేటర్ ఎన్నికల మీద కూడా పూర్తి ఫోకస్ పెట్టి జాతీయ స్థాయి నేతలను కూడా ప్రచారానికి అందించింది. ఈ క్రమంలో బిజెపి పార్టీ భారీగా పుంజుకోగా ఆ మేర టిఆర్ఎస్ పార్టీకి దెబ్బ పడిందని చెప్పొచ్చు.

అయితే ఎన్నికల ఫలితాల సరళి మీద కేటీఆర్ కొద్దిసేపటి క్రితం ప్రెస్ మీట్ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి ఓటు వేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు ఆయన. ఫలితం ఆశించిన విధంగా రాలేదని బి.యన్ రెడ్డి నగర్ మౌలాలి మల్కాజ్ గిరి తదితర మొత్తం పది డివిజన్లలో చాలా తక్కువ ఓట్ల మార్జిన్ తో ఓడిపోయామని ఆయన అన్నారు. అయితే నిరాశ పడుతున్నారా అని ఒక విలేకరి ప్రశ్నించగా ఇందులో నిరాశ చెందాల్సిన ఏమీ లేదన్న ఆయన ఫలితాలను విశ్లేషించుకుని ముందుకు వెళతాం అని అన్నారు. 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version