మైక్రోసాఫ్ట్ ఛైర్మన్‌ సత్య నాదెళ్లతో కేటీఆర్ భేటీ

-

భారత పర్యటనలో ఉన్న మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్లతో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. హైదరాబాద్‌లో జరిగిన వీరి సమావేశంలో తెలంగాణ.. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఐటీ, పారిశ్రామిక రంగాల అభివృద్ధి విషయాలు చర్చకు వచ్చినట్టు సమాచారం. బిజినెస్‌, బిర్యానీ గురించి సత్య నాదెళ్లతో చర్చించినట్టు కేటీఆర్ ట్వీట్‌ చేశారు. నిన్న ప్రధాని మోదీతోనూ సత్య నాదెళ్ల సమావేశమయ్యారు.

మరోవైపు కేటీఆర్ ఇవాళ నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. హుజూర్‌నగర్‌లో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలకు మంత్రి హాజరుకానున్నారు. అనంతరం గ్రీన్ వుడ్ పాఠశాల వద్ద ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఈఎస్​ఐ ఆసుపత్రి ప్రారంభోత్సవంతో పర్యటన మెుదలుపెట్టి.. ఆ తర్వాత ఫణిగిరి సీతారామచంద్రస్వామి గట్టు వద్ద నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పరిశీలిస్తారు. ఎమ్మెల్యే సైదిరెడ్డి ఇంట్లోనే మధ్యాహ్నం భోజనం చేస్తారు. సాయంత్రానికి చండూరులో కొన్ని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి.. సాయంత్రం తిరిగి హైదరాబాద్‌కు ప్రయాణమవుతారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version