ఆ రెండు కేసీఆర్ నిజం చేసారు: కేటిఆర్

-

పెద్దలు ఇల్లు కట్టి చూడు , పెళ్లి చేసి చూడు అంటారని… అంటే ఆ రెండు కష్టమే అని అర్ధమని మంత్రి కేటిఅర్ అన్నారు. జియ గూడా లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రారంభించిన మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. పేదల కల సాకారం చేసిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆయన కొనియాడారు. పేద ఇంటి ఆడ బిడ్డ పెళ్లికి లక్షా 116 రూపాయలు ఇస్తున్నామని అన్నారు. ఇప్పుడు పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఇస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

560 స్క్వేర్ ఫీట్ తో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఇస్తున్నాం అని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం గా 18 వేల కోట్ల రూపాయల తో 2 లక్షల 75 వేల డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కడుతున్నాం అన్నారు. ఇప్పటికే సగం రెడీ గా ఉన్నాయని చెప్పారు. డబుల్ బెడ్ రూమ్ పంపిణీ విషయంలో టిఆర్ఎస్ నేతలు ఎవరూ జోక్యం చేసుకోరని ఆయన స్పష్టత ఇచ్చారు. డబుల్ బెడ్ రూమ్ ఇస్తామంటూ మోసాలకు పాల్పడే దళారులను ప్రజలు నమ్మవద్దు అన్నారు. ఇళ్ల పంపిణీ పారదర్శకంగా ఉంటుందని హామీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version