నటి గౌతమి పక్కన కూర్చోనని చెప్పిన కేటీఆర్.. అసలేమైందంటే?

-

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారన్న విషయం తెలిసిందే. ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌-2024 హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి కేటీఆర్..ఇటీవల క్యాన్సర్ బారి నుంచి కోలుకున్న సీనియర్ నటి గౌతమి పక్కన కూర్చోవడానికి నిరాకరించారు. అందుకు సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

దీంతో పలువురు కేటీఆర్‌ను నెట్టింట విమర్శిస్తున్నారు. అయితే, అందుకు గల కారణాలపై బీఆర్ఎస్ క్లారిటీ ఇచ్చింది. సమ్మిట్ జరిగే టైంలో గౌతమికి హాయ్ చెప్పి.. షేకండ్ ఇచ్చిన కేటీఆర్ గౌతమి పక్కన కూర్చోవడానికి నిరాకరించి పక్కనే ఉన్న ప్రకాశ్ రాజ్ పక్కన కూర్చున్నారు. పక్కనే కూర్చోవాలని గౌతమి ఆఫర్ చేసినా.. తాను పబ్లిక్ మీటింగ్ వెళ్లి వచ్చానని.. మీకు ఇన్‌ఫెక్షన్ సోకే ప్రమాదం ఉందని చెప్పి కేటీఆర్ దూరంగా కూర్చున్నారని బీఆర్ఎస్ పార్టీ క్లారిటీ ఇచ్చింది.దీంతో కేటీఆర్ చేసిన పనిని అందరూ సమర్థిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news