BRS పార్టీ మార్చడంపై KTR కీలక ప్రకటన

-

BRS పార్టీ మార్చడంపై KTR కీలక ప్రకటన చేశారు. తమ పార్టీ ప్రారంభం నుంచి పేరు ఒక్కటే మారిందని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR అన్నారు. ‘తెలంగాణ రాష్ట్ర సమితిగా ఆవిర్భవించిన పార్టీ ఈ రోజు భారత రాష్ట్ర సమితిగా మారింది. మన పార్టీ పేరు మారింది గానీ.. మన జెండా మారలేదు, అజెండా మారలేదు, నాయకుడు మారలేదు, గుర్తు కూడా మారలేదు.

ఈ గులాబీ జెండాను చూపెట్టి ఏ పార్టీ అంటే తెలంగాణా పార్టీ అనే అంటారు తప్ప ఇంకో పేరు రాదు’ అని అన్నారు. భూముల విక్రయంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం భారీ ఆర్థిక నేరానికి పాల్పడిందని ఆరోపించారు. అటవీ భూములను నాశనం చేస్తూ సుప్రీంకోర్టు తీర్పులను రేవంత్ సర్కార్ తుంగలో తొక్కిందన్నారు. భారీ కుట్రపై కేంద్రప్రభుత్వంతోపాటు దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news