Guntur Kaaram : కుర్చీ మడతపెట్టి సాంగ్ ప్రోమో వచ్చేసింది

-

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మోస్ట్ వాంటెడ్ మూవీ గుంటూరు కారం. వచ్చే సంక్రాంతికి ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది. అయితే ఈ మూవీపై నెట్టింట తెగ పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి.

Kurchi Madathapetti Song Promo

మొదటగా హీరోయిన్‌ గా తీసుకున్న పూజా హెగ్డే స్థానంలో శ్రీలీల ఈ సినిమాలోకి రాగా.. ఇటీవలే.. మీనాక్షి చౌదరి కూడా వచ్చారు. అయితే.. తాజాగా గుంటూరు కారం సినిమా నుంచి కుర్చీ మడతపెట్టి సాంగ్ ప్రోమో వచ్చేసింది. ఇందులో ఎలాంటి వీడియో బైట్స్ చూపించకుండా కేవలం మోషన్ పోస్టర్ తోనే పాట రిలీజ్ చేశారు. ఫుల్ సాంగ్ త్వరలోనే రిలీజ్ చేస్తా మని ప్రకటించారు. ఇక ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తుండగా….. తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news