లక్షకోట్లతో కట్టిన ప్రాజెక్టు మూడేళ్లలోనే కుంగిపోవటం సిగ్గుచేటు : మంత్రి ఉత్తమ్

-

లక్ష కోట్ల రూపాలయతో కట్టిన ప్రాజెక్టు మూడేళ్లలోనే కుంగిపోవటం అతి పెద్ద ఘటనగా రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పేర్కొన్నారు. జరిగిన నష్టానికి ప్రాజెక్టు నిర్మించిన వారే బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటనలో భాగంగా మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి…. హైదరాబాద్‌ నుంచి బయలుదేరారు. మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస రెడ్డితో కలిసి కాసేపట్లో ఆయన మేడిగడ్డకు చేరుకోనున్నారు.

మేడిగడ్డ వేదికగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అంశాలతోపాటు ప్రాణహిత ప్రాజెక్టు విషయమై మంత్రులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. అక్టోబర్‌ 21వ తేదీన ప్రాజెక్టు కుంగితే ప్రభుత్వం మారే వరకు ఘటనపై గత ప్రభుత్వం ఒక్కసారైనా స్పందించకపోవటం బాధాకరమని ఉత్తమ్‌ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో పరిణామాలపై కేసీఆర్‌ ఒక్క మాటైనా మాట్లాడలేదని చెప్పారు. లక్షకోట్ల రూపాయలతో కట్టిన దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్టు మూడేళ్లలోనే కుంగిపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. తక్కువ డ్యామేజీ జరిగి ఉండాలనే తాము కూడా కోరుకుంటున్నామని మంత్రి ఉత్తమ్ చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news