బ్రేకింగ్ : వికారాబాద్ అడవిలో యువతి దారుణ హత్య

-

వికారాబాద్ జిల్లా లోని కోటపల్లి ప్రాజెక్టు వెనుక అడవి ప్రాంతంలో యువతి దారుణ హత్యకు గురయ్యింది. వికారాబాద్ జిల్లా కోటపల్లి మండలం అన్నసాగర్ గ్రామ శివారులో ఈ దారుణం చోటుచేసుకుంది. సుమారు 22 ఏళ్ళు ఉన్న గుర్తు తెలియని మహిళని 4 రోజుల క్రితం ప్లాస్టిక్ సంచిలో కట్టి ఆ అటవీ ప్రాంతంలో పాతి పెట్టినట్లు తెలుస్తోంది.

శవాన్ని కుక్కలు పీకుతుండగా గ్రామానికి చెందిన కావలి బంట్రోతు గమనించి స్థానిక సర్పంచ్ కు విషయం తెలపడంతో పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వికారాబాద్ డిఎస్పీ సంజీవరావు, సిఐ మురళి సంఘటనా స్థలానికి చేరుకొని శవాన్ని వెలికి తీసి వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి లో మర్చరికి తరలించారు. ఈ మృతదేహానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ప్రాజెక్టు కింది భాగంలో మృతదేహాన్ని ప్లాస్టిక్ కవర్లలో చుట్టి అగంతకుడు పూడ్చిపెట్టినట్టు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version