సరికొత్త టీవీ ఛానెల్ రానుంది .. వెనక ప్లానింగ్ జరుగుతోందా ?

-

తెలుగు మీడియా రంగంలో మరో కొత్త ఛానల్ రాబోతోంది. ఇప్పటికే శాటిలైట్ ద్వారా 16 కు పైగా న్యూస్ ఛానల్ లు పనిచేస్తున్నాయి. ఇలాంటి సమయంలో సీనియర్ జర్నలిస్ట్ హక్కుల దినేష్ సారథ్యంలో మరొక కొత్త ఛానల్ ఆవిర్భవించబోతోంది. గతంలో టీవీ9, ఎక్సప్రెస్ టివి అదేవిధంగా tv 5 చానల్స్ లో కీలక స్థానాల్లో పనిచేసిన దినేష్… క్రియేటివ్ వర్క్స్ లో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్నిఏర్పరచుకొన్నారు అని మీడియా సర్కిల్ లో వినపడుతున్న టాక్. పరిస్థితి ఇలా ఉండగా కరోనా వైరస్ ఉపద్రవానికి మీడియా రంగంలో అనేకమంది ఉద్యోగాలు కోల్పోతున్న టైములో, కొత్త ఛానల్ రాబోతున్న తరుణంలో, కొంతమందికి ఈ విషయం శుభపరిణామం అని చెప్పవచ్చు. ఒక జాతీయ చానల్ తన పరిధిని విస్తరించే క్రమంలో భాగంగా తెలుగులో కూడా ప్రాంతీయ ఛానల్ ని స్టార్ట్ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.

 

దీంతో తెలుగు మీడియా రంగంలో దినేష్ పనితనాన్ని తెలుసుకున్న సదరు జాతీయ మీడియా ఛానల్ సిబ్బంది కొత్త టీవీ ఛానల్ బాధ్యతలను అతనికి  అప్పజేప్పినట్లు సమాచారం. అయితే ఈ కరోనా కారణంగా లాక్ డౌన్ విధించడంతో కార్యకలాపాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. త్వరలో లాక్ డౌన్ కేంద్ర ప్రభుత్వం ఎత్తివేయబోతున్న తరుణంలో అతి త్వరలోనే సరికొత్త తెలుగు న్యూస్ ఛానల్ అందుబాటులోకి రాబోతున్నట్లు సమాచారం. 

Read more RELATED
Recommended to you

Exit mobile version