ఎమ్మెల్సీ కవిత పై కాంగ్రెస్ చేసిన విమర్శలను తీవ్రంగా ఖండించిన బీసీ సంఘాల నాయకులు

-

జ్యోతిరావు పూలే విగ్రహాన్ని అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటు చేయాలంటూ ఉద్యమిస్తున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు చేసిన విమర్శలను బీసీ సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో బీసీ సంఘాల నాయకులు, యునైటెడ్ ఫ్రాంట్ నాయకులు గురువారం రోజు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో యునైటెడ్ ఫూలే ఫ్రంట్ రాష్ట్ర నాయకుడు రాజారాం యాదవ్ మాట్లాడుతుంటే పొన్నం ప్రభాకర్ ,శ్రీధర్ బాబు నోరు అదుపులో పెట్టుకోవాలని తెలిపారు.

ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో పూల విగ్రహ ఏర్పాటు కోసం, బీసీల హక్కుల సాధనకు భారీ ఎత్తున ఉద్యమం చేస్తామని వెల్లడించారు. పూలే విగ్రహ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ తో ఇంద్ర పార్క్ వద్ద ఈనెల రెండో వారంలో మహాధర్నా నిర్వహించబోతున్నామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించకపోతే ఉద్యమం తీవ్రతరంగా చేస్తామని హెచ్చరించారు.బీసీ విద్యార్థి సంఘాల జేఏసీ చైర్మన్ డా. ఎల్చల దత్తాత్రేయ, బోల్ల శివ శంకర్,ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ ఇంకా తదితరులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news