అక్కడ 30 ఏళ్ల తర్వాత సినిమా హాల్స్… అసలు ఏమైందంటే?

-

 

కశ్మీర్​లో మూడు దశాబ్దాల తర్వాత సినిమా హాల్స్ అందుబాటులోకి వచ్చాయి. ఫుల్వామా, షోపియాన్ ​ జిల్లాలలో ఆదివారం మల్టీపర్పస్ సినిమా హాళ్ల​ను ప్రారంభించారు జమ్ము కశ్మీర్​ లెప్టినెంట్​ గవర్నర్​ మనోజ్​ సిన్హా. వీటికి సంబంధించిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్​ చేశారు. భవిష్యత్​లో జమ్ములోని ప్రతి జిల్లాలో ఇలాంటి మాల్స్​ను నెలకొల్పుతామని సిన్హా పేర్కొన్నారు. సినిమాల ప్రదర్శనతో పాటు ఇన్ఫోటెయిన్​మెంట్, స్కిల్ డెవలప్​మెంట్ కోసం ఇక్కడ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. మూడు దశాబ్దాల తర్వాత ప్రారంభమైన సినిమా హాళ్లు ఇవేనని చెప్పారు.

వీటితో పాటు వచ్చేవారం కశ్మీర్​లో తొలి ఐనాక్స్ మల్టీప్లెక్స్ ప్రారంభం కానుంది. శ్రీనగర్​లోని సోమ్​వార్ ప్రాంతంలో దీన్ని తెరవనున్నారు. 520 సీట్ల సామర్థ్యం కలిగిన మూడు స్క్రీన్లు ఇందులో ఉండనున్నాయి. ఐనాక్స్ హాల్ ప్రారంభమైతే.. మూడు దశాబ్దాల తర్వాత కశ్మీర్‌లో నెలకొల్పిన మల్టీప్లెక్స్​గా ఇది రికార్డుకెక్కనుంది.

 

హిందీ ఫిల్మ్​ ఇండస్ట్రీ కలర్​ సినిమాలను తెరకెక్కిస్తున్న సమయంలో షమ్మి కపుర్​ సాంగ్​ గుల్మార్గ్​లోని థియేటర్లలో హల్​చల్​ చేసింది. “చాహే కోయి ముఝే జంగ్లీ కహే” అని సాగే ఈ పాట అప్పట్లో సూపర్​హిట్​గా నిలిచింది. బాలీవుడ్ సినిమా షూటింగ్‌లకు కశ్మీర్ చిరునామాగా ప్రసిద్ధి చెందింది. అప్పటి బాలీవుడ్​ సినిమాల్లో కశ్మీర్ అందాలను అంతలా చూపించారు. అయితే కాశ్మీర్‌లో తీవ్రవాదం చెలరేగాక ఆ ట్రెండ్​ కనుమరుగైపోయింది.

1980లో ఈ ప్రాంతంలో దాదాపు 12 థియేటర్లు ఉండేవని, ఉగ్రవాదుల బెదిరింపులతో ఈ హాల్స్​ను మూసివేయాల్సివచ్చిందని అధికారులు తెలిపారు. ఆ తర్వాత కొన్ని థియేటర్లను పునః ప్రారంభించేందుకు అధికారులు చర్యలు చేపట్టినప్పటికీ 1999లో లాల్​ చౌక్​లోని రిగాల్​ సినిమా థియేటర్​పై గ్రెనేడ్​ దాడి జరగడం వల్ల ఆ ఆలోచనను మానుకున్నారు. మరో రెండు థియేటర్లైన నీలమ్​, బ్రాడ్వే తిరిగి ప్రారంభమైనప్పటికి జనాదరణ లేక వాటిని మూసివేయాల్సి వచ్చింది. ఇలా వరుస దాడులు జరిగినప్పటికి ఐనాక్స్ మాల్​ తెరవడం పట్ల కశ్మీర్ లోయలోని చిత్రనిర్మాతలు, కళాకారులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news