ఫోన్లో చిన్న తగాదా.. వేర్వేరుచోట్ల ప్రేమజంట ఆత్మహత్య

-

వాళ్లిద్దరూ ప్రేమికులు! ఒకరంటే ఒకరికి ప్రాణం! వాళ్లిద్దరూ గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ఎప్పటిలాగే గురవారం కూడా ఫోన్లో మాట్లాడుకుంటున్న ఆ ప్రేమికుల మధ్య మాటామాటా పెరిగింది. క్షణికావేశంలో ఇద్దరూ ఒకరి తర్వాత ఒకరు వేర్వేరు ప్రాంతాల్లో ప్రాణాలు తీసుకున్నారు.

విశాఖపట్నంలోని గోపాలపురం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో తల్లిదండ్రులతో కలిసి నివసిస్తున్న శిరీష, కంచరపాలెం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నివాసం ఉంటున్న వెంకట్‌ గత కొన్నేండ్లుగా ప్రేమికులు. గురువారం ఫోన్లో మాట్లాడుకుంటుండగా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆవేశంగా ఇంట్లోకి వెళ్లిన శిరీష.. ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలిసిన వెంటనే వెంకట్‌ తన ఊరి పరిసరాల్లోని ఓ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహ్యతకు పాల్పడ్డాడు. గంట వ్యవధిలోనే ప్రేమికులిద్దరూ ఆత్మహత్యకు పాల్పడటం స్థానికులను కలచివేసింది.

సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలాలకు చేరుకున్న పోలీసులు పోస్ట్‌మార్టం కోసం మృతదేహాలను స్థానిక కింగ్‌ జార్జ్‌ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే ప్రేమికులిద్దరి మధ్య ఫోన్లో ఏ విషయంపై గొడవ జరిగిందనే సంగతి మాత్రం వెల్లడికాలేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version