దారుణం : కొడుకుని చంపి పక్కన పడుకున్నాడు..

-

ఉత్తర ప్రదేశ్ కాన్పూర్ కు చెందిన 43 ఏళ్ల మతిస్థిమితం కోల్పయిన వ్యక్తి తన ఏడేళ్ల కుమారుడిని హత్య చేసి, శుక్రవారం రాత్రి ఆ బాలుడు మృతదేహంతో నిద్రపోయాడని ఆయన భార్య ఆరోపించారు. ఆమె ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు, అలంకర్ శ్రీవాస్తవ కు భార్య సరికా, కుమారుడు రుశాంక్ (07) మరియు కుమార్తెలు – గీతిక (10) మరియు తులికా (16) లు ఉన్నారు.  నగరంలోని సీసామౌ ప్రాంతంలో వీరు నివసించేవారు. ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలుగా పని చేస్తున్న అతని భార్య సరికా మాట్లాడుతూ, శనివారం ఉదయం 5 గంటల సమయంలో తమ కుమారుడిని గొంతు కోసి చంపినట్లు అలంకర్ తనకు తెలియజేశాడని తాను వెంటనే తన ఇంటికి వెళ్లి తన బంధువులను పిలిచానని పేర్కొంది.

murder
murder

అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఒక బృందం సంఘటన స్థలానికి చేరుకుంది. శుక్రవారం రాత్రి అలంకర్ తమ కొడుకును చంపి, మృతదేహంతో డ్రాయింగ్ రూమ్‌లో నిద్రపోయాడని సరికా చెప్పారు. తెల్లవారుజామున 5 గంటలకు, ఆమె భర్త వారి పడకగదికు వచ్చి తాను మేల్కొన్న తర్వాత అతను తన కొడుకును చంపానని తెలియజేశాడట. అలానే ఇప్పుడు తమ కొడుకును ఎవరూ ఇబ్బంది పెట్టరని, అతను ఇప్పుడు విశ్రాంతిగా నిద్రపోతున్నాడని చెప్పాడని ఆమె పేర్కొంది. లాక్ డౌన్ సమయంలో ఉద్యోగం కోల్పోయిన అలంకర్ కు మితిస్థిమితం కోల్పోయాడని కుటుంబ సభ్యులు పోలీసులకు చెప్పారు. అతను తన కొడుకు మరియు కుమార్తెలను అమితంగా ప్రేమించాడని, వారి భవిష్యత్తు గురించి ఎప్పుడూ ఆందోళనతో ఉండేవాడని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news