ఇవాళ చంద్ర గ్రహణం.. తిరుమల, రాజన్న, శ్రీశైలంతో పాటు పలు ఆలయాలు మూసివేత

-

నేడు సంపూర్ణ చంద్ర గ్రహణం అన్న సంగ‌తి తెలిసిందే. ఈ త‌రుణంలోనే.. భార‌త దేశంలోని ప‌లు దేవాల‌యాలు మూత‌ప‌డ‌నున్నాయి. తిరుమ‌ల శ్రీవారి ఆల‌యం కూడా మూసివేయ‌నున్నారు. 12 గంటల పాటు శ్రీవారి ఆలయం మూసివేస్తారు. ఇవాళ‌ సా 3:30 గంటల నుంచి రేపు ఉ 3 గంటలకు వరకు దర్శనాలు నిలిపివేస్తారు.

Lunar eclipse today Tirumala, Rajanna, Srisailam and many other temples will be closed
Lunar eclipse today Tirumala, Rajanna, Srisailam and many other temples will be closed

అటు నేడు శ్రీశైలం మల్లన్న ఆలయం మూసివేయ‌నున్నారు. చంద్రగ్రహణం సందర్భంగా మధ్యాహ్నం 1గంట నుండి రేపు సోమవారం ఉదయం 5 గంటల వరకు స్వామి అమ్మవార్ల ఆలయ ద్వారాలు మూసివేస్తారు. చంద్రగ్రహణం రాత్రి 9:56 నిమిషాలకు ప్రారంభమై రాత్రి 1:26 నిమిషాలకు ముగుస్తుంది.

స్వామి అమ్మవార్ల ఆలయాలతో పాటు ఉప ఆలయాలైన సాక్షి గణపతి,హఠకేశ్వరం,పాలధార పంచదార,శిఖరేశ్వరం ఆలయాలు మూసివేయ‌నున్నారు. సోమవారం ఉదయం 5 గంటలకు ఆలయ ద్వారాలను తెరిచి ఆలయ శుద్ధి సంప్రోక్షణ పూజలు నిర్వహించనున్నారు ఆలయ పండితులు. యాదాద్రి, వేముల‌వాడ రాజ‌న్న ఆల‌యాలు కూడా మూత‌ప‌డ‌తాయి.

Read more RELATED
Recommended to you

Latest news