మధ్యప్రదేశ్ హైకోర్టు వైరెటీ తీర్పు.. జాతీయ జెండాకు 21 సార్లు సెల్యూట్!

-

దేశానికి వ్యతిరేకంగా, శత్రుదేశానికి అనుకూలంగా నినాదాలు చేసిన వ్యక్తికి మధ్యప్రదేశ్ హైకోర్టు విచిత్రమైన శిక్ష విధించింది. పాకిస్తాన్ జిందాబాద్, హిందుస్థాన్ ముర్దాబాద్ అంటూ నినాదాలు చేసిన ఓ వ్యక్తి బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా.. మధ్యప్రదేశ్ హైకోర్టు వెరైటీ షరతు విధించింది.నెలలో రెండు సార్లు ‘భారత్ మాతాకీ జై’ అని నినదిస్తూ త్రివర్ణ పతాకానికి 21 సార్లు సెల్యూడ్ చేయాలని ఆదేశించింది.

భోపాల్‌లో నివసిస్తున్న నిందితుడు ఫైజల్ అలియాస్ ఫైజన్ ఇటీవల పాకిస్తాన్‌కు అనుకూలంగా నినాదాలు చేశాడు. దీంతో అతడిని మిస్రోడ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో అతడి బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా మధ్యప్రదేశ్ హైకోర్టు కండిషన్స్ పెట్టింది. నెలకు 2 సార్లు పోలీస్‌స్టేషన్‌కు రావాలని..వచ్చిన ప్రతిసారి 21 సార్లు జాతీయ జెండాకు వందనం చేయాలని షరతులు విధిస్తూ బెయిల్ మంజూరు చేసింది. అదేవిధంగా విచారణ పూర్తయ్యేలోపు జాతీయ జెండాకు వందనం చేయాల్సిందేనని బెయిల్ ఉత్తర్వుల్లో జడ్జి తీర్పునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version