మానవ మృగం.. కన్నకూతురికి మత్తుమందిచ్చి ఏడాదిగా..

-

సమాజానికి తలవంపులు తెస్తూ కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కూతురిపైనే అత్యాచారానికి పాల్పడ్డాడో ప్రబుద్ధుడు. మానవ సంబంధాలకే మాయని మచ్చగా నిలిచిన ఈ ఘటన మధ్యప్రదేశ్‌ రాష్ట్రం శివపూర్‌లో వెలుగుచూసింది. శివపూర్‌కు చెందిన ఓ వ్యక్తికి భార్య, మగ్గురు ఆడపిల్లలు. వీరి పెద్ద కుమార్తెకు 16 ఏళ్లు. భర్త ప్రవర్తన నచ్చక అతని భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో ముగ్గురి కూతుర్లతో కలిసి ఇతను ఉండేవాడు. భార్య దూరం కావడంతో తన కామవాంఛ తీర్చుకునేందుకు ఇతని దృష్టి పెద్దకుమార్తెపై పడింది. రోజూ రాత్రుళ్లు ఆమెకు నిద్రమాత్రలు ఇచ్చి మత్తులో ఉండగా అత్యాచారం చేసేవాడు.

ఏడాదిగా అకృత్యానికి పాల్పడుతూ దాన్ని వీడియో తీసి మిగిలిన ఇద్దరి పిల్లలకూ చూపిస్తూ వారినీ లైంగిక వేధింపులకు గురిచేసేవాడు. దీంతో తండ్రిని చూస్తే రాక్షసుడిని చూసినట్టు కుమార్తెలు వణికిపోయేవారు. ఇటీవ‌ల అత‌ని మూడో కూతురు ఓ ఇంట్లో పనికి కుదిరింది. ఓ సందర్భంలో ఇంటి యజమానురాలు ఆమె తండ్రి గురించి అడిగితే భయంతో వణికిపోయింది. య‌జ‌మాని అనుమానంతో అస‌లు విష‌యం తెలుసుకోగా ఆశ్చ‌ర్య‌పోయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు పెద్ద కుమార్తెను విచారించి ఆమె చెప్పిన ఆధారాలు మేరకు నిందితుడి అరెస్టు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news