Maharashtra:అటల్ సేతుపై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య

-

ముంబైలోని అటల్ సేతుపై నుంచి 38 ఏళ్ల ఇంజనీర్ శ్రీనివాసన్ కురుటూరి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీనివాసన్ బుధవారం మధ్యాహ్నం 12.24 గంటలకు అటల్ సేతుపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.ఈ ఘటనపై న్హవా షెవా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.

అటల్ సేతు వద్దనున్న సీసీటీవీ ఫుటేజీలో..ఒక వ్యక్తి కారులో నుండి బయటకు వచ్చి వంతెన రెయిలింగ్పైకి వేగంగా ఎక్కి, సముద్రంలోకి దూకడం కనిపిస్తుంది. మృతుడు శ్రీనివాసన్ విదేశాల్లో ఉద్యోగం చేసేవాడని పోలీసులు గుర్తించారు.ఇటీవలే ఇంటికి తిరిగి వచ్చి వ్యాపారం ప్రారంభించాడు. ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు అని తెలుస్తోంది. పోలీసులు స్థానికుల సాయంతో సముద్రంలో సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు.అయితే మృతదేహం ఇంకా లభ్యం కాలేదు.

Read more RELATED
Recommended to you

Latest news