గాంధీ క‌ళ్ల‌జోడు విలువ రూ.2.5కోట్లు

-

భార‌త జాతిపిత మహాత్మాగాంధీ కళ్లజోడు భారీ ధ‌ర ప‌లికింది. ఇంగ్లండ్‌లోని ఈస్ట్ బ్రిస్టోల్ ఆక్షన్స్ సంస్థ క‌ళ్ల‌జోడును వేలం వేసింది. సౌతాఫ్రికాలో ఉన్న సమయంలో గాంధీ ధరించిన గోల్డ్ ప్లేటెడ్ జత కళ్ల అద్దాలను బ్రిస్టల్‌లో వేలానికి పెట్టగా ఏకంగా 2,60,000 యూరోల‌కు అమ్ముడుపోవడం విశేషం. అంటే భార‌త క‌రెన్సీలో దీని విలువ‌ సుమారు రూ. 2.5 కోట్లు అన్న‌మాట‌. ఈ అద్దాలను అమెరికాకు చెందిన వ్యక్తి దక్కించుకున్నాడు.

నిజానికి.. వీటిని వేలంలో తొలుత 15,000 యూరోల ధరకే రిజర్వ్ చేశామని ఆక్షనర్ ఆండీ స్టోవ్ తెలిపారు. కాగా, భార‌త్ స‌హా చాలా దేశాల నుంచి ప్రజలు ఈ అద్దాలను ద‌క్కించుకోవ‌డానికి ఆస‌క్తి చూప‌డంతో ధర ఒక్కసారిగా పెరిగింది. గతంలో సౌతాఫ్రికాలో గాంధీజీ ఉన్నప్పుడు 1920లో బ్రిటిష్‌ పెట్రోలియంలో పని చేసే వ్యక్తికి ఇచ్చారని సంస్థ తెలిపింది. వంశపారంపర్యంగా తనకు వచ్చిన ఈ కళ్లజోడును ఇంగ్లండ్‌కు చెందిన వ్యక్తి బ్రిస్టోల్ ఆక్షన్‌కు పంపాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version