ఆ డైరెక్టర్ ని ఎలా ఒప్పించాలో తెలియక తలపట్టుకున్న మహేశ్ బాబు !

-

సూపర్ స్టార్ మహేష్ బాబు తన కెరియర్ లో ఏ డైరెక్టర్ అయినా సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా ఇస్తే కచ్చితంగా ఆ డైరెక్టర్ ని మళ్ళీ రిపీట్ చేస్తాడు. గతంలో పూరి జగన్నాథ్, శ్రీను వైట్ల, కొరటాల శివ లతో విజయాలు సాధించి మళ్లీ వాళ్లకి అవకాశాలు ఇవ్వడం జరిగింది. ఇదే తరుణంలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు ‘మహర్షి’ అనే సినిమా చేసి అదిరిపోయే బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ఆ తర్వాత వంశీ కి అవకాశం ఇచ్చాడు మహేష్. కానీ వంశీ చెప్పిన స్టోరీ సరిగ్గా నచ్చకపోవడంతో వంశీని పక్కన పెట్టేశాడు.Image result for mahesh vamsi paidipally

కాగా ‘మహర్షి’ సినిమా విజయం తరువాత నెక్స్ట్ సినిమా కూడా మహేష్ తోనే చేయాలని ఒక కుటుంబ సభ్యుడిగా మహేష్ తో జర్నీ చేసిన వంశీ కి తన సినిమాని మహేష్ పక్కన పెట్టడం పట్ల తెగ ఫీల్ అయిపోతున్నారు. ‘మహర్షి’ హిట్ తర్వాత మహేష్ కుటుంబంతో బాగా కలిసి కనిపించడం పార్టీలు చేసుకోవడం ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాకు మహేష్ ను ఇటు వంశీ, అటు మహేష్ కుమార్తెలు కలిసి ఇంటర్వూ చేయడం, ఇలా ఒకటి కాదు…రెండు కుటుంబాలు ఒక్కటే అన్నంతగా కలిసిపోయాయి.

 

దీంతో మరొక స్టోరీతో మహేష్ ని ఒప్పించాలని చూసిన వంశీని ఎలా పక్కన పెట్టాలో తెలియక మహేష్ కి తల పట్టుకున్న అంత పని అయింది అంట. ఇటువంటి సందర్భంలో వంశీ పైడిపల్లితో సినిమా మొత్తం క్యాన్సిల్ అయ్యిందని మహేష్ టీం కావాలనే సోషల్ మీడియాలో వార్త ప్రచారం చేయడంతో విషయం మొత్తం తెలుసుకుని వంశీ దీని ఓ అవమానంగా తీసుకున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినబడుతున్నాయి. కానీ మహేష్ బాబు వంశీ పైడిపల్లికి చాలా టైం ఇచ్చిన గాని ఒప్పించ లేకపోవటంతో మహేష్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు మరో పక్క టాక్. 

Read more RELATED
Recommended to you

Latest news