BREAKING : నువ్వే నా సర్వస్వం..అన్న మృతిపై మహేష్‌ బాబు పోస్ట్‌

-

ఘట్టమనేని రమేష్‌ బాబు మృతి పై ప్రిన్స్‌ మహేష్‌ బాబు తాజాగా ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ చేశాడు. నువ్వే నా బలం, ధైర్యం,, సర్వస్వం అంటూ చాలా ఎమోషనల్‌ అయ్యారు మహేష్‌ బాబు. “మీరు నాకు స్ఫూర్తిగా నిలిచారు. నువ్వే నా బలం, నువ్వు నా ధైర్యం, నువ్వే నా సర్వస్వం, నువ్వు లేకుంటే ఈ రోజు ఉన్న మనిషిలో సగం ఉండేవాడిని కాదు. మీరు నా కోసం చేసిన ప్రతిదానికీ ధన్యవాదాలు. ఇప్పుడు విశ్రాంతి… విశ్రాంతి… ఈ జీవితంలో నాకు మరొకటి ఉంటే, నువ్వే నా ‘అన్నయ్యా’ ఎప్పటికీ మరియు ఎప్పటికీ మరియు ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తున్నాను.” అంటూ పోస్ట్‌ పెట్టాడు ప్రిన్స్‌ మహేష్‌ బాబు.

కాగా…ఘట్టమనేని రమేష్‌ బాబు నిన్న అనారోగ్యంతో… మరణించిన సంగతి తెలిసిందే. కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న రమేష్‌ బాబు శనివారం సాయంత్రం తవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు హుటా హుటిన ఆయనను గచ్చి బౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. అంతలోనే రమేష్‌ బాబు తుది శ్వాస విడిచారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version