కేటీఆర్ కు సవాల్ విసిరిన టీపీసీసీ అధ్యక్షులు..!

-

కేటీఆర్ కు టీ పీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సవాల్ విసిరారు. పదేళ్ల BRS పాలన.. ఏడాది కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్ధమా కేటీఆర్ అని అడిగారు. కేటీఆర్ ఉత్తర కుమారుడి ప్రగల్భాలు పలకడం ఆపేసి.. దమ్ముంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయండి. చెల్లి, బావ ఇచ్చిన షాక్ తో కేటీఆర్ మతిభ్రమించి మాట్లాడుతున్నాడు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ – బిఆర్ఎస్ లోపాయికారీ ఒప్పందం పై చర్చకు సిద్ధం.. బీసీ కులగణన, ఎస్సీ వర్గకరణ చర్చకు ఎక్కడికి రమన్నా వస్తాం.

సీఎం గురించి మాట్లాడే నైతిక అర్హత కేటీఆర్ కి లేదు. మీ నాయిన, మీ బావ, నువ్వు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ నియోజకవర్గాల్లో ప్రజలు గుండు సున్నాతో బుద్ధి చెప్పిన విషయం మరిచావా.. బిఆర్ఎస్ పదేళ్ల విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని సీఎం రేవంత్ ,మంత్రుల బృందం పునర్వికాసం వైపు నడిపిస్తోంది. మూడు ముక్కలుగా చీలిన బిఆర్ఎస్ పార్టీ.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలంగాణ రాజకీయ ముఖ చిత్రంలో కనిపించదు అని టీపీసీసీ అధ్యక్షులు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version