సమతామూర్తి విగ్రహ ఆవిష్కరణ బీజేపీ రాజకీయ కార్యక్రమంగా సాగింది.- మల్లు బట్టి విక్రమార్క

-

హైదరాబాద్లో సమతామూర్తి విగ్రహావిష్కరణ, రామానుజాచార్యుల ఫిలాసఫీని ప్రచారం చేసే కార్యక్రమంలా కాకుండా.. బీజేపీ రాజకీయ కార్యక్రమంగా సాగిందని విమర్శించారు కాంగ్రెస్ నేత మల్లు బట్టి విక్రమార్క. మోదీ రామానుజాచార్యలు ఫిలాసపీని చెప్పకుండా.. రాజకీయ కార్యక్రమంగా సాగిందన్నారు. ప్రధానిని ఆహ్వానించినప్పటి నుంచి వీడ్కోలు పలికే వరకు బీజేపీ నేతలే కనిపించారని అన్నారు. ఈక్వాలిటీకి అనుగుణంగా అక్కడ కార్యక్రమం జరగలేదని అన్నారు. ఇది రామానుజాచార్యులకు అవమానం జరిగే విధంగా  జరిగిందన్నారు. మానవులంతా ఒక్కటే అని.. నీ మతాన్ని ప్రేమిస్తూనే పరమతాన్ని కూడా గౌరవించాలని, కుల మతాలకు అతీతంగా చూడాలని రామానుజాచార్యలు చెప్పారని..కానీ నరేంద్ర మోదీ, బీజేపీ నాయకత్వం.. పూర్తిగా దీనికి భిన్నంగా ఉన్న రాజకీయ పార్టీ అని అన్నారు. ఆ రాజకీయ పార్టీ సభలాగా కార్యక్రమం నడించన్నారు. రామానుజాచార్యుల అతివిగ్రహం నెలకొల్పిన తర్వాత హైదరాబాద్ నగరానికి వచ్చిన గౌరవాన్ని బీజేపీ నేతల మంట కలిపారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version