పరీక్ష రాస్తే చాలు.. ఉద్యోగం మీకే..!

-

ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలనుకునేవారి ని సులభంగా బురిడీ కొట్టిస్తున్నారు కొందరు మోసగాళ్లు.. పరీక్ష రాయండి చాలు.. ఆ తర్వాత మేం చూసుకుంటామని నమ్మబలికి లక్షలకు లక్షలు కొల్లగొడుతున్నారు. ఉద్యోగం కావాలన్న కోరికను మోసగాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు.

తాజాగా ఇలాంటి ఉదంతం మరొకటి బయటపడింది. ఉద్యోగాల పేరిట మోసగిస్తున్న నిందితుడిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. గ్రూప్-2 రాసిన వారికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మోసగించిన నిందితుడిని ఉత్తర మండలం టాస్క్ ఫోర్స్, గోపాలపురం పోలీసులు అరెస్ట్ చేశారు.

వివరాల్లోకి వెళ్తే.. మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన నోముల రాజేందర్ గౌడ్ ఇంటర్ ఫెయిల్ అయ్యాడు. 2016లో జరిగిన గ్రూప్-2 పరీక్షకు దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను రాజేందర్ గౌడ్ సేకరించాడు. ఉద్యోగం వచ్చేలా చేస్తానని, తనకు ప్రముఖులు, ఉన్నతాధికారులతో పరిచయాలు ఉన్నాయని నమ్మించాడు.

ఒక్కొక్కరి వద్ద నుంచి లక్షలు సేకరించాడు. మహబూబ్ నగర్ జిల్లా గద్వాలకు చెందిన సహదేవుడు నుంచి ఏకంగా రూ.13 లక్షలు తీసుకున్నాడు. తాజాగా గ్రూప్-2 ఫలితాలు విడుదలైన నేపథ్యంలో ఇతడికి డబ్బులు ఇచ్చి ఉద్యోగం రానివారు పోలీసులను ఆశ్రయిస్తే ఇతగాడి బండారం బయటపడింది.

Read more RELATED
Recommended to you

Latest news