చాక్లెట్ ఇచ్చి రేప్.. వీడియోలతో బ్లాక్ మెయిల్

-

హైదరాబాద్ లోని కూకట్పల్లిలో దారుణం చోటు చేసుకుంది. శ్రీధర్ గౌడ్ అనే వ్యక్తి వివాహితకు మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేసినట్టు సమాచారం. మత్తుతో కూడిన బిస్కెట్లు, చాక్లెట్లు శ్రీధర్ గౌడ్ తినిపించడంతో ఆ బిస్కెట్లు తిన్న తర్వాత సదరు వివాహిత స్పృహ కోల్పోయింది.

 

దీంతో ఆ సమయంలో వివాహితపై అత్యాచారం చేసిన శ్రీధర్ గౌడ్ ఆమె స్పృహలో లేని సమయంలో న్యూడ్ ఫోటోలు, వీడియో లు తీసి బ్లాక్మెయిల్ కు పాల్పడ్డాడు. తన వద్ద ఉన్న ఫోటోలను డిలీట్ చేయాలంటే 20 లక్షల రూపాయలు కావాలని డిమాండ్ శ్రీ ధర్ డిమాండ్ చేసాడు. 20 లక్షలు ఇవ్వకపోతే సోషల్ మీడియాలో ఫోటోలు వీడియోలు పోస్ట్ చేస్తానంటూ బెదిరింపులకు దిగాడు.
అయితే అంత డబ్బు ఇచ్చుకోలేని సదరు మహిళ సైబరాబాద్ షి టీమ్ ను ఆశ్రయించింది. అయితే ఈ డబ్బు ఇచ్చే వంకతో శ్రీధర్ గౌడ్ ని వలపన్ని పట్టుకున్న సైబరాబాద్ షి టీమ్ అతణ్ణి అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version