ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవ్వడం తో మా(మూవీ ఆర్టిస్ట్ అసోసయేషన్) ఎన్నికల్లో పోటీ చేస్తున్న సభ్యులు దూకుడు పెంచారు. ఇప్పటి వరకు మా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నట్టు ప్రకాష్ రాజ్, సివీఎల్ నరసింహారావు, మంచు విష్ణు, రఘుబాబు ప్రకటించారు. అయితే వీరిలో ప్రకాష్ రాజ్ మాత్రమే ప్యానల్ ను ప్రకటించారు. ప్రకాష్ రాజ్ ప్యానల్ లో పలువురు సీనియర్ నటీనటుల తో పాటు అనసూయ, సుధీర్ లాంటి యువ నటీనటులు కూడా ఉన్నారు.ఇక ఈరోజు మంచు విష్ణు కూడా తన ప్యానల్ ను ప్రకటించనున్నారు. మంచు విష్ణు ఉదయం 11 గంటలకు ప్యానల్ సభ్యులను ప్రకటించనున్నారు. దాంతో విష్ణు ప్యానల్ లో ఎవరెవరు సభ్యులు గా ఉంటారన్నది ఆసక్తికరంగా మారింది. కాగా మాజీ మా అధ్యక్షుడు నరేష్ మాత్రం విష్ణు ప్యానల్ కు ఇప్పటికే తన మద్దతును ప్రకటించారు. ఇక మంచు విష్ణు ముందు నుండి మా బిల్డింగ్ ప్రధాన అంశంగా తీసుకుని ఎన్నికలలోకి దిగుతున్నారు.
ఉదయం 11గంటలకు మంచు విష్ణు ప్యానల్ ప్రకటన..!
By Surya
-
Previous article
Read more RELATEDRecommended to you
TSRTC: శ్రీశైలం వెళ్లేవారికి ఆర్టీసీ గుడ్ న్యూస్..
TSRTC: శ్రీశైలం వెళ్లేవారికి ఆర్టీసీ గుడ్ న్యూస్..చెప్పింది. భక్తుల సౌకర్యార్థం శ్రీశైల...
ఎండల వల్ల వచ్చే తలనొప్పి నుంచి ఉపశమనం పొందాలంటే ఇలా చేయండి
వేసవి కాలం మొదలైంది.. ఇంట్లో ఉంటేనే సాయంత్రానికి అలిసిపోతున్నాం. ఇక బయటకు...
రేపు పొద్దున 10 గంటలకు గన్ పార్క్ దగ్గర వస్తున్నా..రేవంత్ కు హరీష్ మరో సవాల్
సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు మరో సవాల్ విసిరారు. రేపు...