ఉదయం 11గంటలకు మంచు విష్ణు ప్యానల్ ప్రకటన..!

-

ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవ్వడం తో మా(మూవీ ఆర్టిస్ట్ అసోసయేషన్) ఎన్నికల్లో పోటీ చేస్తున్న సభ్యులు దూకుడు పెంచారు. ఇప్పటి వరకు మా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నట్టు ప్రకాష్ రాజ్, సివీఎల్ నరసింహారావు, మంచు విష్ణు, రఘుబాబు ప్రకటించారు. అయితే వీరిలో ప్రకాష్ రాజ్ మాత్రమే ప్యానల్ ను ప్రకటించారు. ప్రకాష్ రాజ్ ప్యానల్ లో పలువురు సీనియర్ నటీనటుల తో పాటు అనసూయ, సుధీర్ లాంటి యువ నటీనటులు కూడా ఉన్నారు.ఇక ఈరోజు మంచు విష్ణు కూడా తన ప్యానల్ ను ప్రకటించనున్నారు. మంచు విష్ణు ఉదయం 11 గంటలకు ప్యానల్ సభ్యులను ప్రకటించనున్నారు. దాంతో విష్ణు ప్యానల్ లో ఎవరెవరు సభ్యులు గా ఉంటారన్నది ఆసక్తికరంగా మారింది. కాగా మాజీ మా అధ్యక్షుడు నరేష్ మాత్రం విష్ణు ప్యానల్ కు ఇప్పటికే తన మద్దతును ప్రకటించారు. ఇక మంచు విష్ణు ముందు నుండి మా బిల్డింగ్ ప్రధాన అంశంగా తీసుకుని ఎన్నికలలోకి దిగుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news