ఒలింపిక్స్ లో భారత్ కు మొదటి మెడల్..!

-

ఒలింపిక్స్ 2024లో భారత్ కు మొదటి మెడల్ వచ్చింది. మహిళల 10 మీటర్ ఎయిర్ పిస్టల్ షూటింగ్ విభాగంలో మను భాకర్ ఇండియాకు ఫస్ట్ మెడల్ అందించింది. ఫైనల్స్ లో కోరాయి షూటర్లకు గట్టి పొట్టి ఇచ్చిన మను భాకర్ 221.7 పాయింట్స్ తో మూడో స్థానంలో నిలిచింది. కేవలం 0.1 తేడాతో సిల్వర్ మెడల్ మను భాకర్ చేజారింది అనే చెప్పాలి. అయితే ఈ ఒలింపిక్స్ లో 10 మెడల్స్ టార్గెట్స్ తో ఇండియా ఉంది అనే చెప్పాలి.

ఈ లక్ష్యాన్ని సాధించడంలో షూటర్లదే కీలక పాత్ర అని మొదటి నుండి అందరూ అనుకుంటున్నారు. కానీ మన షూటర్లు నిరాశపరుస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు మను భాకర్ కాంస్య పతకం సాధించి ఇండియన్ అభిమానులకు ఆనందాన్ని అందించింది అనే చెప్పాలి. అయితే ఈ రోజు మహిళల ఆర్చర్స్ యొక్క మెడల్ మ్యాచ్ కూడా జరగనుంది. అందులో కూడా మన మహిళా ఆర్చర్లు మెడల్ కోసం గట్టి పోటీ ఇవ్వనున్నారు. చూడాలి మరి ఈ ఒక్క రోజే ఇండియా ఖాతాలో రెండు మెడల్స్ వచ్చి చేరుతాయా లేదా అనేది.

Read more RELATED
Recommended to you

Exit mobile version