80 ఏళ్ల వయస్సులో వివాహం చేసుకున్న వృద్ధ దంపతులు.. నెట్టింట ఫొటోస్ వైరల్..!

-

మహబూబాబాద్ నెల్లికుదురు మండలం వస్త్రం తండాలో పెళ్లి జరిగింది. ప్రస్తుతం ఎక్కడ చూసిన అంతా ఈ పెళ్లి గురించే మాట్లాడుకుంటున్నారు. వివరాలు చూస్తే.. గుగులోతు లాలమ్మ(75), సమిడా నాయక్(80) దంపతులు 80 సంవత్సరాల వయసులో పెళ్లి చేసుకున్నారు. 70 సంవత్సరాల క్రితం గంధర్వ వివాహం చేసుకున్న వీళ్లకు నలుగురు కొడుకులు అలానే ఒక కూతురు ఉన్నారు.

మనవళ్ళు, మనవరాలు, తాత నానమ్మ పెళ్లి చేయాలని మనుమడు యాకూబ్ పుట్టిన రోజు సందర్భంగా పెళ్లి చేయించాడు. అయితే ఈ వృద్ధ దంపతుల పెళ్లి చూడడానికి తండా లోని జనం అంతా కూడా తరలివచ్చారు. ఈ దంపతుల పెళ్లి ఫొటోస్ కూడా నెట్టింట వైరల్ గా మారాయి. ఈ ఫొటోస్ ని చూసి అంతా షాక్ అయ్యిపోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news