ఉగ్రవాదుల సామూహిక అంత్యక్రియలు.. వీడియోలు వైరల్..

-

పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ గట్టి ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్ ప్రేరేపిత లష్కరే తోయిబా నిర్వహించిన దాడికి స్పందనగా, బుధవారం తెల్లవారుజామున భారత సాయుధ దళాలు “ఆపరేషన్ సిందూర్” పేరిట పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) ,  పాకిస్తాన్‌లోని కీలక ఉగ్రవాద స్థావరాలపై దాడులు నిర్వహించాయి. ఈ దాడుల్లో సుమారుగా 80 మంది లష్కరే తోయిబా , జైషే మహ్మద్ తీవ్రవాదులు హతమయ్యారు. ఈ ఆపరేషన్‌లో ముఖ్యంగా బహావల్పూర్, మురిద్కే వంటి ప్రాంతాల్లోని ఉగ్రవాదుల ప్రధాన కేంద్రాలపై దాడులు జరగడం ప్రాధాన్యత కలిగిన అంశంగా మారింది. అనూహ్యంగా ఎక్కువ మంది తీవ్రవాదులు హతమయ్యారనే వార్తలు వెలుగులోకి వచ్చాయి.

పాక్‌లోని సామాజిక మాధ్యమాల్లో వీరి అంత్యక్రియల వీడియోలు వైరల్ అవుతున్నాయి. పాకిస్తాన్ జెండాతో వీరి మృతదేహాలకు నివాళులు అర్పించడం, ప్రభుత్వ మద్దతును స్పష్టంగా వెల్లడిస్తోంది. ఇప్పటివరకు తమ దేశంలో ఉగ్రవాదులు లేరని చెప్పుకొచ్చిన పాకిస్తాన్, ఇప్పుడు ఈ అంత్యక్రియల్లో పాల్గొనడం వివాదాస్పదంగా మారింది. పాక్ ఆర్మీ, పోలీసులు, ఐఎస్ఐ అధికారులు తీవ్రవాదుల అంతిమ యాత్రలో పాల్గొన్న వీడియోలు ఇంటర్నెట్‌లో హల్చల్ చేస్తున్నాయి. ఇది పాకిస్తాన్ ఉగ్రవాదానికి ఎలా వేదికగా మారిందో మరోసారి చాటుతోంది.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news