త్వరలో పేదలకు ఇళ్ల స్థలాలు: మేరుగు నాగార్జున

-

ఆర్-5 జోన్లో మంత్రి మేరుగు నాగార్జున పర్యటించారు. లేఔట్ స్థలాల పనులపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. త్వరలో పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని మంత్రి చెప్పారు. రాష్ట్రంలో ఇంకా అసమానతలు పోలేదన్నారు. పేదలు రాజధాని ప్రాంతంలో ఉండకూడదనే చంద్రబాబు ఆలోచనని మండిపడ్డారు.

గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్‌ కుటుంబాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి పరామర్శించారు. కాగా వైసీపీ ఎమ్మెల్యే గిరిధర్‌ తల్లి శివపార్వతి(68) గుండెపోటుతో మృతిచెందిన సంగతి తెలిసిందే. శ్యామలానగర్‌లో గుంటూరు వెస్ట్‌ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్‌ నివాసంలో ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్‌ మాతృమూర్తి శివపార్వతి సోమవారం ఉదయం ఆమె తుదిశ్వాస విడిచారు. ఆమె భౌతికకాయానికి మంత్రులు మేరుగు నాగార్జున, విడదల రజిని, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ నేతలు సందర్శించి నివాళులర్పించారు. అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version