మరో వారంలో పెళ్లి..అర్ధరాత్రి యువతిని తగలబెట్టేశారు.. !

-

ఆంధ్ర ప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా ములకలచెరువు మండలం గట్టు కింద పల్లి గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన ఇంటి వరండాలో నిద్రిస్తున్న ఓ యువతి మీద హత్యాయత్నం జరిగింది, గుర్తుతెలియని వ్యక్తులు అర్ధరాత్రి సమయంలో యువతీ మీద పెట్రోల్ పోసి నిప్పంటించిన ట్లు సమాచారం అందుతోంది. ఈ క్రమంలో సదరు యువతికి తీవ్ర గాయాలు అయినట్లు చెబుతున్నారు. దీంతో హుటాహుటిన ఆమెను మదనపల్లి జిల్లా ఆస్పత్రికి తరలించిన కుటుంబ సభ్యులు అక్కడ చికిత్స అందిస్తున్నారు.

మరో వారం రోజుల్లో పెళ్లి కూడా ఉందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇలాంటి సమయంలో ఆమె మీద దాడి ఎందుకు జరిగింది అనేది ఇప్పుడు అనుమానాస్పదంగా మారింది. అయితే దీని వెనక లవ్ అఫైర్ లాంటిది ఏమైనా ఉందా అని అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే యువతి ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు విషమంగా ఉందని చెబుతున్నారు. మరి దీని వెనుక ఎవరున్నారు అనేది తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version