మిల్క్ ఏటీఎం.. కేరాఫ్ స్వచ్ఛమైన పాలు…?

-

ఇప్పటివరకు మనం చాలా రకాల ఏటీఎంలు చూసే ఉంటాము.. ఇప్పుడు కొన్ని కొన్ని బ్యాంకులు తమ కస్టమర్లకు వినూత్నమైన సేవలు అందించేందుకు ఏటీఎంలలో సరికొత్త సర్వీసులను కూడా అందుబాటులోకి తెస్తున్నాయి. ఇక్కడ మీరు చూసే ఎటిఎం మాత్రం ఇప్పటివరకు మీరు కనివిని ఎరుగి ఉండరు. కనీసం కలలో కూడా ఊహించి ఉండరు. అయితే ఇక్కడ ఉన్న ఏటీఎంలో డబ్బులు తీసుకోవడం కుదరదు… డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.

ఏటీఎంలో మనం డబ్బులు చెల్లించడం ఏంటి అని ఆశ్చర్య పోతున్నారు కదా… అయితే ఇక్కడ ఉన్నది మని ఏటీఎం కాదు మిల్క్ ఏటీఎం. మనం ఎంత డబ్బు చెల్లిస్తే అంతమేరకు మిల్క్ ఇక్కడ ఏటీఎం నుంచి తీసుకోవచ్చు. తాజాగా మిల్క్ ఏటీఎం కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. జగిత్యాల జిల్లాలోని మెట్పల్లి వాసవి దేవాలయం వద్ద మిల్క్ ఏటీఎంలు ఏర్పాటు చేశారు. ఎన్ని రూపాయలు ఏటీఎంలో కి పంపిస్తే అంత మొత్తంలో పాలు మనం పొందవచ్చు. ఇది అందరికీ ఎంతగానో ఉపయోగపడుతుంది అని నిర్వాహకులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news