మైనింగ్ అక్రమాలు..నా పేరు వాడుతారా? ఆ అధికారిపై పవన్ కళ్యాణ్ సీరియస్

-

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాలనలో తన మార్క్ చూపిస్తున్నారు.ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి, సంక్షేమం విషయంలో అస్సలు రాజీపడటం లేదు.గిరిజన, తండా ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనపై స్పెషల్ ఫోకస్ పెట్టిన పవన్.. గిరిజన ప్రాంతాల్లో యుద్ధప్రాతిపదికన రహదారుల నిర్మాణం చేపడుతున్నారు. అంతేకాకుండా ఎవరైనా అక్రమాలకు పాల్పడితే వారిపై కన్నెర్ర చేస్తున్నారు.

తాజాగా ఓ ఫారెస్ట్ అధికారిపై ఏపీ డిప్యూటీ సీఎం సీరియస్ అయ్యారు. కాకినాడ DFO డి.రవీంద్రనాథెడ్డి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో తనకు సన్నిహిత సంబంధాలున్నాయని చెప్పుకుని మైనింగ్ వ్యవహారాల్లో తలదూరుస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో పవన్ ఘాటుగా స్పందించారు. తన పేరు, పేషీ పేరు వాడటంపై ఆగ్రహించిన పవన్ కళ్యాణ్.. ఈ ఘటనపై విచారించి వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version