యాత్ర-2 సినిమా దర్శకుడికి మంత్రి అంబటి సత్కారం

-

దర్శకుడు మహి వి రాఘవ్ దర్శకత్వంలో తమిళ నటుడు జీవ వైఎస్ జగన్ పాత్రలో నటించిన తాజా చిత్రం యాత్ర 2. ఇదివరకే 2019 ఎలక్షన్స్ కి ముందు యాత్ర సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రము మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు దీనికి సీక్వల్ గా ఎన్నికల ముందు యాత్ర 2 ను విడుదల చేశారు.

ఈ నేపథ్యంలో యాత్ర- 2 మూవీని తెరకెక్కించిన డైరెక్టర్ మహి వి రాఘవ్ను మంత్రి అంబటి రాంబాబు సత్కరించారు. మంచి సినిమాను అందించిన మహికి ధన్యవాదాలంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టు చేశారు. ఈ చిత్రంలోని ఎమోషనల్ సన్నివేశాలు తన గుండెను పిండేశాయని ఆయన ఇటీవల ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.ఈ చిత్రాన్ని త్రీ ఆట‌మ్ లీవ్స్‌, వీ సెల్యూలాయిడ్, శివ మేక కలిసి నిర్మిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news