కేంద్రం అప్పులు చేయకుండానే ప్రభుత్వాన్ని నడుపుతుందా…? పురంధేశ్వరికి మంత్రి అవంతి కౌంటర్

-

దగ్గుబాటి పురంధేశ్వరిపై మంత్రి అవంతి ఫైర్ అయ్యారు. మూడు రాజధానులపై బీజేపీది రెండు నాల్కల ధోరణి అని ఆమెకు చురకలు అంటించారు. దగ్గుబాటి పురంధేశ్వరి పై మాకు గౌరవం ఉంది…కానీ మేము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. కేంద్రం అప్పులు చేయకుండానే ప్రభుత్వం ను నడుపుతుందా…? అని నిలదీశారు. బీజేపీ రాష్ట్రాలతో సమానంగా బీజేపీయేతర రాష్ట్రాలను గౌరవించాలని ఆమె పై ఫైర్ అయ్యారు. మూడు రాజధానులపై కోర్టు తీర్పును గౌరవిస్తాం…అదే సమయంలో ప్రజా న్యాయస్థానం తీర్పు మాకు ముఖ్యమన్నారు.

సాంకేతికమైన సమస్యలను అధిగమించి మూడు రాజధానులు ఏర్పాటు చేస్తాం…ఇచ్ఛాపురం నుంచి హిందూపురం వరకు మాకు ప్రజలు స్పష్టమైన మెజార్టీ ఇచ్చారని చెప్పారు. జనం ఆకాంక్షలను గౌరవించాల్సిన బాధ్యత మామీద ఉంది… అమరావతితో పాటు ఇతర ప్రాంతాలను అభివృద్ధి చేస్తామంటే అభ్యంతరాలు ఎందుకో అర్ధం కావడం లేదు…భవిష్యత్తులో ప్రాంతీయ వేర్పాటు తత్వం వస్తే మళ్ళీ నష్టపోకూడదనే ఉద్దేశంతోనే వికేంద్రీకరణకు ప్రయత్నమన్నారు. పవన్ కళ్యాణ్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని ఫైర్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version