151 స్థానాలు గెలిచిన ధీరుడు, ధీశాలి జగన్ : మంత్రి జోగి రమేశ్‌

-

భారత దేశంలో ఏ నాయకుడు చేయనన్ని కిలోమీటర్లు పాదయాత్ర చేసిన ఏకైక నాయకుడు, 151 స్థానాలు గెలిచిన ధీరుడు, ధీశాలి జగన్ అంటూ కొనియాడారు ఎన్టీఆర్ జిల్లా మంత్రి జోగి రమేష్. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కార్యకర్తల చలవతోనే జగన్ సీఎం అయ్యారు…మేం మంత్రులం అయ్యామని, పార్టీలో శాత్వతంగా ఉండేది కార్యకర్తలే అని ఆయన తెలిపారు. తల్లిలాంటి పార్టీని అందరూ కాపాడుకోవాలని, 2024లో జగన్ కు ఓటేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని, ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది చంద్రబాబుకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు.

చంద్రబాబు, దత్త పుత్రుడు, వాళ్ళ మీడియా అంతా కలిసి వచ్చినా జగన్‌ను ఇంచు కూడా కదపలేరని, నారా చంద్రబాబు చిన్న జిల్లాల పర్యటనకు బయల్దేరాడు.. పప్పూ, బెల్లాల మాదిరి ప్రజలకు పంచేస్తున్నారని గోల చేస్తున్నాడు, రాష్ట్రం దివాలా తీస్తుందని చంద్రబాబు అంటున్నాడు, 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు ప్రజల కోసం ఒక్క పథకమైనా పెట్టాడా అని ఆయన వ్యాఖ్యానించారు. సింహం కడుపున సింహమే పుడుతుంది.. జగన్ మోహన్ రెడ్డి పాలనే అందుకు నిదర్శనమన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని ఢీ కొట్టే దమ్ము చంద్రబాబుకి ఉందా అని ఆయన సవాల్‌విసిరారు. పొత్తుల కోసం చంద్రబాబు పొర్లాడుతున్నాడని, అందరూ కట్టకట్టుకుని వచ్చినా చిత్తు చిత్తుగా ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version