వికలాంగులకు మోటార్ వెహికల్స్ పంపిణీ చేసిన మంత్రి కేటీఆర్

-

మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా వికలాంగులకు మూడు చక్రాల వాహనాలు అందించేందుకు పలువురు ప్రజాప్రతినిధులు ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా నెక్లెస్ రోడ్ లోని జలవిహార్ లో లబ్ధిదారులకు మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా త్రిచక్ర వాహనాలను అంద జేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. రాజకీయాల్లో ఉన్నప్పుడు డబ్బులు ఎక్కువ ఖర్చు చేస్తామని.. అనవసర ఖర్చులు కూడా చేయాల్సి వస్తుంటదన్నారు.

బ్యానర్లు, హోర్డింగ్స్ పెట్టి వృధా ఖర్చు చేస్తామని.. దాన్ని తగ్గించుకోవాలని ఈ ఆలోచన చేశామని తెలిపారు. మనకు ఆత్మ సంతృప్తి ఇచ్చే కార్యక్రమంలో భాగంగానే గిఫ్ ఏ స్మైల్ నిర్వహిస్తున్నామని వెల్లడించారు. కోవిడ్ సందర్భంగా వృధా ఖర్చులు పెట్టొద్దని గత సంవత్సరం నా పుట్టినరోజు సందర్భంగా వంద అంబులెన్స్ లు వితరణ చేశామన్నారు. ఈ సంవత్సరం వెయ్యి మోటార్ సైకిళ్లు అంగవైకల్యం ఉన్న వారికి అందించామని.. టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు స్వతహాగా ముందుకు వచ్చి ఇబ్బందుల్లో ఉన్నవారికి సహాయం చేస్తున్నారని తెలిపారు. త్రిచక్ర వాహనం ద్వారా జీవనోపాధికి కూడా ఉపయోగ పడుతుందని అభిప్రాయపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version