కరోనా థర్డ్‌ వేవ్‌ పై మంత్రి కేటీఆర్‌ కీలక ఆదేశాలు

-

రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయములో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి కేటీఆర్. అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. కరోనా థర్డ్ వేవ్ ఎదుర్కొనేందుకు కావలసిన ఏర్పాట్లు మందులు అందుబాటులో ఉన్నాయని.. కష్టకాలములో అవసరమైతే కావలసిన సిబ్బందిని నియమించుకునే వెసులుబాటు స్థానిక అధికారులకు కల్పించామని ఈ సందర్భంగా కేటీఆర్‌ వివరించారు.

వాక్సినేషనులో రాష్ట్రములోనే జిల్లా ఐదవ స్థానములో ఉందని.. జిల్లాలో నాలుగు వందల డెబ్బైతొమ్మిది వైద్య బృందాలు లక్షా యాబై వేల ఇండ్లు ఫీవర్ సర్వే చేస్తున్నాయని తెలిపారు. రాష్ట్రములో జిల్లా హెల్త్ ప్రొఫైల్ స్కీంకు పైలట్ ప్రాజెక్టుకు ఎంపికైంది. పిబ్రవరిలో మొదటి వారములో పనులు ప్రారంభవుతాయని…జిల్లాలోని పదమూడు మండలాలు, రెండు మున్సిపాలిటీలలో మొదటి విడత ధలిత బందు లబ్దిదారుల ఎంపిక ప్రారంబిస్తామని చెప్పారు.

జిల్లాలో మనఊరు మనబడిలో భాగముగా ఐదువందల పది పాటశాలలను మూడు సంవత్సరాలలో ఆధునీకరిస్తామని.. తెలంగాణ రాష్ట్ర ఏర్పడినప్పటినుండి కేంద్రం ప్రవేశపెట్టిన ఏడు బడ్జెట్టులలో ఇక్కడి నేతన్నలకు కేంద్రం పట్టించుకున్నది ఏమీలేదని స్పష్టం చేశారు. వరంగల్ లోని కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కుకు కేంద్రం ఎనిమిది వందల్ తొంబై ఏడు కోట్ల తొంబ్బై రెండు లక్షలు మంజూరు చేయించాలని బండి సంజయ్ కు డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news