నేడు నల్గొండ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన

-

నల్లగొండ : నేడు నల్గొండ జిల్లాలో మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డిల పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేయనున్నారు మంత్రి కేటీఆర్. ఈ నేపథ్యం లో ఉదయం 8:30 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి 10:30 గంటలకు నల్లగొండకు రానున్న మంత్రులకు, బైక్ ర్యాలీలతో స్వాగతం పలకనున్నారు టిఆర్ఎస్ నేతలు.

ఉదయం 10:45 నిమిషాలకు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఎస్సీ,ఎస్టీ హాస్టల్ ప్రారంభంలో పాల్గొననున్న మంత్రులు.. ఉదయం 11 గంటలకు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఐటీ హబ్ కార్యాలయానికి శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం 12:30 గంటలకు బీట్ మార్కెట్లో వెజ్ & నాన్ వెజ్ మార్కెట్ యార్డ్ కు శంకుస్థాపన, మధ్యాహ్నం 1 గంటకు నల్లగొండ జైలుఖాన వద్ద రైతుబజార్, బస్తీ దవాఖానలకు స్థల పరిశీలన చేయనున్నారు.

అనతరం మధ్యాహ్నం 2 గంటలకు తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు పరామర్శించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు నల్లగొండ జిల్లాకు సంబంధించిన మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు కేటీఆర్. అనంతరం హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం కానున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version