మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి: కుప్పం లో చంద్రబాబు, హిందూపురం లో బాలకృష్ణను ఖచ్చితంగా ఓడిస్తాము..!

-

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. కురుబ సామాజిక వర్గానికి చెందిన దీపిక హిందూపురం అసెంబ్లీ నుండి పోటీ చేస్తారని మంత్రి పెద్దిరెడ్డి రామ చంద్రా రెడ్డి అన్నారు. అలానే, హిందూపురం పార్లమెంటు నుంచి బోయ-వాల్మికి వర్గానికి చెందిన శాంత ఉన్నట్టు రామ చంద్రా రెడ్డి చెప్పారు. వెనుకబడిన వర్గాలకు చెందిన ఇద్దరు మహిళలకు చోటే ఎప్పుడు కూడా పార్టీ అవకాశం ఇవ్వలేదు అని అన్నారు.

అలానే, రామ చంద్ర రెడ్డి మాట్లాడుతూ, కుప్పం లో చంద్రబాబు, హిందూపురం లో బాలకృష్ణను ఖచ్చితంగా ఓడిస్తాము అని అన్నారు. టిక్కెట్ల కేటాయింపు లో ఉన్న అసంతృప్తి ని త్వరలోనే అధిగమిస్తామని కూడా ఆయన అన్నారు. టీడీపీ, జనసేన తరపున పోటీ ఎవరు చేస్తున్నారనేది ఇప్పటిదాకా తెలీదు అన్నారు. అలానే ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోయిందన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news