రాష్ట్రంలో ప్రభుత్వ భూమి ఎక్కడ కబ్జాకు గురైనా అధికారులకు తప్పక సమాచారం ఇవ్వాలని బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే శనివారం హైదరాబాద్ బంజారాహిల్స్లోని సర్వే నెంబర్ 102/1HAK/1లో కబ్జాకు గురైన 12 ఎకరాల ప్రభుత్వ భూమిని మంత్రి పొన్నం సమక్షంలో అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ స్థలాన్ని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, రెవెన్యూ అధికారులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ ముందుగా పరిశీలించారు.ఈ సందర్భంగా ఆ భూమికి ఫెన్సింగ్ వేసే విషయంలో అధికారులకు మంత్రి పలు సూచనలు చేశారు.ప్రభుత్వ భూమిని కాపాడిన కలెక్టర్, ఆర్డీవో, తహశీల్దార్ను మంత్రి పొన్నం ప్రత్యేకంగా అభినందించారు.